Fri May 03 2024 22:13:32 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో చేరిన జనసేన నేతలు
ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జనసేన నేత డీఎంఆర్ శేఖర్ చేరారు
అమలాపురానికికు చెందిన జనసేన పార్టీ సీనియర్ నేత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో డీఎంఆర్ శేఖర్ చేరారు. గొడిచెర్ల స్టే పాయింట్ వద్ద జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆయనకు పార్టీ కండువాను కప్పి వైసీపీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మంచి ప్రయారిటీ ఇస్తుందని తెలిపారు.
జగన్ సమక్షంలో....
అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా జననేన పార్టీ నేతగా కూడా డీఎంఆర్ శేఖర్ పనిచేస్తున్నారు. 2019లో ఆయన అమాలపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఇంకా వైసీీపీకి నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
Next Story