Sat May 04 2024 16:34:40 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ, తెలంగాణను మళ్లీ కలపండి.. బొత్స సీరియస్ కామెంట్స్
సిడబ్ల్యూసీ డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు
సిడబ్ల్యూసీ డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు కౌంటర్ ఇచ్చారు. విలీన మండలాలను కలపాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు. తాము ఆ ఐదు గ్రామాల ప్రజల బాగోగులను చూసుకుంటామని బొత్స సత్యనారాయణ తెలిపారు. వందేళ్ల తర్వాత ఇంత వరద వచ్చిందని, అది తెలుసుకోకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
హైదరాబాద్ ఆదాయం...
అలాగనుకుంటే తాము ఆదాయం వచ్చే హైదరాబాద్ ను కోల్పోలేదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కలసి కూర్చుని చర్చించుకోవాలి తప్పించి రెచ్చగొట్టడం సరికాదని బొత్స అన్నారు. తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా ముఖ్యమని వివరించారు. విలీన మండలాలను కలిపే పనైతే, ఏపీ, తెలంగాణను తిరిగి కలపాలని తాము డిమాండ్ చేస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజా ప్రయోజనాలకు, రాజకీయాలకు ముడిపెట్టవద్దని బొత్స సూచించారు.
Next Story