Mon May 06 2024 14:24:53 GMT+0000 (Coordinated Universal Time)
ప్లీనరీకి విజయమ్మ... జగన్ వెంటే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ వైసీపీ ప్లీనరీకి హాజరయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ వైసీపీ ప్లీనరీకి హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్ తో కలసి ఆమె ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకే వాహనంలో ఇద్దరూ ప్లీనరీకి వచ్చారు. ఇడుపులపాయ నుంచి నేరుగా బయలుదేరి వచ్చిన జగన్, విజయమ్మ ప్లీనరీకి చేరుకున్నారు.
ప్రచారానికి...
విజయమ్మ ప్లీనరీకి రారన్న ప్రచారానికి తెరదింపారు. తనయుడు జగన్ తో కలసి వచ్చిన విజయమ్మ అందరికీ అభివాదం చేశారు. అందరినీ అభిమానంతో పలకరించారు. ఒకేవేదికపై తల్లీ కొడుకులిద్దరూ ఆశీనులవ్వడంతో అందరి అనుమనాలు పటాపంచాలయ్యాయి.
Next Story