ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది

Update: 2024-08-22 02:47 GMT

ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 9 తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక‌్షలు జరగాల్సి ఉంది. అయితే గత కొంత కాలంగా నిరుద్యోగులు ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

అభ్యర్థుల వినతి మేరకు...
దీంతో వచ్చే నెలలో జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా చేసినట్టు ప్రకటించింది. అయితే తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటించే అవకాశముంది.


Tags:    

Similar News