Andhra Pradesh : కొత్త చీఫ్ సెక్రటరీ ఆయనేనా? చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉంది ఆయనేనట
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది;

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారన్న దానిపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబరు 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆరు నెలలపాటు పదవీ కాలాన్ని నీరబ్ ప్రసాద్ కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో మరోసారి ఆ అవకాశం లేదు. చంద్రబాబు కూడా పొడిగించే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో కొత్త సీఎస్ గా ఎవరిని నియమించుతారన్న ఆసక్తి అధికారవర్గాల్లో వ్యక్తమవుతుంది. చీఫ్ సెక్రటరీ పదవి కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నా అందులో ఒక్కరికే అవకాశముంటుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now