ఎక్సైజ్ కార్యాలయంలో కొనసాగుతున్న సీఐడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తుంది

Update: 2024-06-30 07:02 GMT

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తుంది. కార్యాలయంలో కంప్యూటర్లు ఓపెన్ చేయించి సీఐడీ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి సీఐడీ విస్తృత తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంతో పాటు మరికొన్ని జిల్లాల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తుంది.

కీలక సమాచారం కోసం...
ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో తనిఖీలు చేసిన సీఐడీ అధికారులు హైదరాబాద్, తాడేపల్లిలోని నివాసాల్లో సోదాలు చేసి కీలక సమాచారం సేకరించినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రికార్డులు అక్రమంగా తరలించారని వాసుదేవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News