వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ విచారణ నేడు

నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది

Update: 2024-08-20 05:40 GMT

నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు వల్లభనేని వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ కోసం ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి.

టీడీపీ కార్యాలయం...
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అసలు దేశంలో ఉన్నారా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే వల్లభనేని వంశీ ముందస్తు ముందస్తు బెయిల్ పిటీషన్ నేడు విచారణ జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. వంశీ తరుపున న్యాయవాదులు ఈ పిటీషన్ ను హైకోర్టులో వేశారు. ముందస్తు బెయిల్ వస్తుందా? రాదా? అన్న టెన్షన్ లో వంశీ అనుచరులున్నారు.


Tags:    

Similar News