ఇక రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు

త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-15 06:53 GMT

kakani govarthan reddy

త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉండేది కేవవం రెండేళ్లు మాత్రమేనని అన్నారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని కాకాణి గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో 90 శాతం మద్యం షాపులు టీడీపీ నేతలకే దక్కాయని కాకాణి ఆరోపించారు.

మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే...
మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ జరిగిందన్న కాకాణి గోవర్థన్ రెడ్డి విద్య, వైద్యం, మద్యం షాపులు..ఇసుక, గ్రావెల్స్‌ మొత్తం సిండికేట్స్‌గా మారాయని విమరశాచరు. చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ కోసమే కొత్త మద్యం పాలసీ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని కాకాణి గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వమని కాకాణి దుయ్యబట్టారు.


Tags:    

Similar News