జగన్ అసెంబ్లీకి వస్తే అందుకు అనుమతిస్తా ; అయ్యన్న పాత్రుడు

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2024-08-17 07:20 GMT

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయప మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ అసెంబ్లీకి  రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు పిలుపు నిచ్చారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రారని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్ష హోదాపై...
జగన్‌ ప్రతిపక్ష హోదాపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తామని స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఉంటుంద‌న్న అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ అసెంబ్లీకి వస్తే వారికి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశమిస్తానని అయ్యన్న పాత్రుడు తెలిపారు.


Tags:    

Similar News