కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌ నాయుడికి కీల‌క ప‌ద‌వి

కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌ నాయుడికి కీల‌క ప‌ద‌వి...

Update: 2024-09-12 02:50 GMT

KinjarapuRamMohanNaidu

కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌ నాయుడికి కీల‌క ప‌ద‌వి వ‌రించింది. ఆసియా ప‌సిఫిక్ స‌భ్య‌దేశాల ఛైర్మ‌న్‌గా ఆయ‌న ఎన్నిక‌య్యారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-ప‌సిఫిక్ మంత్రుల స్థాయి స‌ద‌స్సులో ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. రామ్మోహ‌న్‌నాయుడి పేరును సింగ‌పూర్ ప్ర‌తిపాదించ‌గా భూటాన్ బ‌ల‌ప‌రిచింది. మిగ‌తా స‌భ్య‌దేశాల‌న్నీ ఆమోదం తెల‌ప‌డంతో ఆయ‌న ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది. దేశం త‌ర‌ఫున‌ త‌న‌కు ఈ అరుదైన గౌర‌వం దక్కిందని, ఎంతో ఆనందంగా ఉందన్నారు రామ్మోహ‌న్‌నాయుడు. దేశం త‌ర‌ఫున త‌న‌కు ద‌క్కిన ఈ గౌర‌వాన్ని తాను బాధ్య‌త‌గా స్వీక‌రిస్తాన‌ని, విమాన‌యాన రంగాన్ని సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మ‌రింత అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తానన్నారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పౌర విమానయానానికి సంబంధించిన 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ (APMC)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన, సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రెసిడెంట్ సాల్వటోర్ సియాచిటానో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్ వువాల్నమ్ పాల్గొన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి 29 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.


Tags:    

Similar News