Sajjala : మంగళగిరి పోలీస్ స్టేషన్ కు సజ్జల

మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు

Update: 2024-10-17 12:19 GMT

మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిన్న సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. . సజ్జలతోపాటు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

న్యాయవాదులను మాత్రం...
విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోలీసులతో ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారు. అయితే విచారణ సమయంలో న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం విచారణకు సజ్జలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో సజ్జల ఒక్కరే పోలీస్‌స్టేషన్‌ లోకి వెళ్లారు.


Tags:    

Similar News