YSRCP : నేడు వైసీపీ కీలక భేటీ

వైఎస్సార్సీపీ కీలక సమావేశం నేడు జరగనుంది. ఈరోజు జరిగే వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు

Update: 2024-06-20 01:42 GMT

వైఎస్సార్సీపీ కీలక సమావేశం నేడు జరగనుంది. ఈరోజు జరిగే వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికట్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పోటీ చేసి ఓటమి పాలయిన అభ్యర్థులందరూ హాజరు కానున్నారు. పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులను మాత్రం ఈ సమావేశం నుంచి మినహాయించారు.

ఓటమి పాలయిన...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంభవించిన దారుణ ఓటమిపై విశ్లేషణల చేయనున్నారు. భవిష‌్యత్ లో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయననున్నారు. ఓడిపోయిన అభ్యర్థులనే పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమం ఒక సంకేతాన్ని బయటకు బలంగా పంపాలని నిర్ణయించారు. కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఎలా పనిచేయాలన్న దానిపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News