కాలమనీ మళ్లీ కాటేస్తుంది

ఏపీలో కాల్ మనీ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. కాల్ మనీ దెబ్బకు ఒక వీఆర్వో ఆత్మహత్య చేసుకున్నారు

Update: 2021-11-30 06:32 GMT

ఏపీలో కాల్ మనీ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. కాల్ మనీ దెబ్బకు ఒక వీఆర్వో ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. జిల్లాలోని ఎ. కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌన్ కొండపల్లి వీఆర్వోగా పనికచేస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం గౌస్ వడ్డీ వ్యాపారలు వద్ద అప్పు చేశారు. వడ్డీ చెల్లిస్తున్నా ఇంకా చెల్లించాల్సింది లక్షల్లోనే ఉంది.

బెదిరింపులతో....
మరోవైపు కాల్ మనీ వ్యాపారుల నుంచి బెదిరింపులు కూడా మొదలయ్యాయి. గౌస్ వారి హింసను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కొండపల్లిలో తాను నివాసముంటున్న అద్దె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు కారణం కాల్ మనీ వ్యాపారులేనని లేఖ రాసి చనిపోయాడు. లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News