మహిళలకు రక్షణ‌లేని నగరాల్లో మళ్లీ ఢిల్లీనే టాప్

మొత్తం 19 మెట్రోపాలిటన్ నగరాల నేర లెక్కలన్నీ పరిశీలించగా.. ఒక్క ఢిల్లీలోనే 32 శాతం నేరాలు జరుగుతున్నాయి. అంటే 19..

Update: 2022-08-30 12:15 GMT

మహిళలపై రక్షణ‌లేని నగరాల్లో మళ్లీ ఢిల్లీనే అగ్రస్థానంలో నిలిచింది. మహిళలపై అత్యాచారాలు, దాడుల్లో తన నెంబర్ వన్ ప్రస్థానాన్ని దేశరాజధాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో విడుదల చేసిన లెక్కల్లో ఎక్కువ నేరాలతో ఢిల్లీ మరోసారి మహిళలకు కనీస రక్షణ లేని నగరాల జాబితాలో మొదటిస్థానాన్ని పదిల పర్చుకుంది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన లెక్కలప్రకారం.. ఢిల్లీలో 2021లో మహిళలపై 13,892 నేరాలు జరిగినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. 2020తో పోలిస్తే.. ఇది 40 శాతం అధికం.

మొత్తం 19 మెట్రోపాలిటన్ నగరాల నేర లెక్కలన్నీ పరిశీలించగా.. ఒక్క ఢిల్లీలోనే 32 శాతం నేరాలు జరుగుతున్నాయి. అంటే 19 మెట్రోపాలిటన్ నగరాల్లో జరుగుతున్న ప్రతి 100 నేరాల్లో 32 నేరాలు ఒక్క ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఢిల్లీ తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కేసులు నమోదయ్యాయి. ముంబైలో 5,543 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు 3,127 కేసులతో మూడవ స్థానంలో ఉంది. 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన నేరాల్లో ముంబై, బెంగళూరు వాటా 7.2 శాతం. ఢిల్లీలో 2021లో కిడ్నాపింగ్ 3948, భర్త వేధింపులు 4674, చిన్నారి బాలికలపై అత్యాచారాలు 833 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది.


Tags:    

Similar News