అంత్యక్రియలు చేసినా.. బతికొచ్చాడు

చనిపోయాడని అంత్యక్రియలు చేశారు. చివరకు ఆ వ్యక్తి బతికి రావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు

Update: 2022-07-29 06:34 GMT

చనిపోయాడని అంత్యక్రియలు చేశారు. చివరకు ఆ వ్యక్తి బతికి రావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ ఘటన జరిగింది.. గిద్దలూరు మండలం ముండ్లపాడు కు చెందిన సైదుమియా కన్పించకుండా పోయారు. అదే సమయంలో గిద్దలూరు రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సైదుమియాగా భావించి కుటుంబ సభ్యులు ఆయనకు అంత్య క్రియలు కూడా నిర్వహించారు.

ఒక్కసారిగా ....
చనిపోయి నెలరోజులు కావడంతో కుటుంబ సభ్యులు ఇంకా విషాదం నుంచి కోలుకోలేదు. అయితే సైదుమియా ఒక్కసారిగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్ష మయ్యాడు. దీంతో కొంత సేపు భయానికి గురైన కుటుంబ సభ్యులు సునిశితంగా పరిశీలించిన తర్వాత బతికి ఉన్నాడని భావించి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. చెప్పకుండా వెళ్లిపోయిన సైదుమియా తెలంగాణలోని ఆర్మూర్ లో ఇంతకాలం ఉన్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. కుటుంబ సభ్యులు ఆనందంతో మునిగి తేలారు.


Tags:    

Similar News