మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న భారత యూట్యూబర్ మృతి

మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న భారత యూట్యూబర్

Update: 2022-09-30 08:32 GMT

ప్రముఖ గేమింగ్ యూట్యూబర్ అభియుదయ్ మిశ్రా మరణించాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మిశ్రా ఫ్రీ ఫైర్ గేమ్‌ప్లే వీడియోలను అప్‌లోడ్ చేసేవాడు. అతను భారీ సంఖ్యలో అభిమానులను పెంచుకున్నాడు. "స్కైలార్డ్" అనే పేరుతో పిలిచేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతన్ని లక్షల్లో అనుసరించేవారు. అతడి చివరి ఇంస్టా పోస్టులో "మధ్యప్రదేశ్. ది హార్ట్ ఆఫ్ ఇన్‌క్రెడిబుల్ ఇండియా" అనే క్యాప్షన్‌తో సెల్ఫీ ఉంది. యూట్యూబ్‌లో రెండు వారాల క్రితం తన చివరి వీడియోను పోస్ట్ చేశాడు.


రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్‌పూర్ సమీపంలో రాష్ట్ర రహదారిపై ఆదివారం మిశ్రా ఒక బృందంతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా, ట్రక్కు ఢీకొట్టిందని దైనిక్ భాస్కర్ నివేదించింది. ఈ బృందం మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడిన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి చేపట్టిన పర్యటనలో భాగంగా ఉంది. మిశ్రా అభిమానులు అతని సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.


Similar News