ఏకాంతంగా జంట.! కసిగా చంపిన దుండగులు, జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు

నగర శివారులో జరిగిన జంట హత్యల కేసులో భర్తే ప్రధాన నిందితుడని భావిస్తున్నారు. కిరాతకంగా దుండగులు ఇద్దరిని హతమార్చారు.

Update: 2022-05-04 08:48 GMT

others

హైదరాబాద్ నగర్ శివారులో మహిళ, యువకుడిని దారుణంగా హతమార్చి నగ్నంగా పడేసిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధమే జంట హత్యలకు కారణంగా తెలుస్తోంది. ఇద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన సమయంలో వారిని అనుసరించి వచ్చి కిరాతకంగా హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. దుండగులు ఇద్దరినీ చంపిన తీరు చర్చనీయాంశంగా మారింది. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేయడంతో పాటు.. మహిళ ముఖంపై బండతో కొట్టి కిరాతకంగా చంపేశారు. సేకరించిన వివరాల మేరకు..

సికింద్రాబాద్‌లోని వారాసిగూడకి చెందిన యడ్ల యశ్వంత్(22) కారు డ్రైవర్. ఇటీవల కారు సొంతంగా కొనుక్కుని బాడుగలకు తిప్పుకుంటున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన వివాహిత(28)తో పరిచయమైంది. ఆమెకు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడూ రహస్యంగా కలుసుకునేవారని తెలుస్తోంది. గత ఆదివారం మే 1వ తేదీన సాయంత్రం తన సోదరుడి బైక్ తీసుకుని యశ్వంత్ బయటికి వెళ్లాడు. మూడు రోజులుగా ఆచూకీ లేదు.

మార్చి 3వ తేదీన బుధవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడ బ్రిడ్జి సమీపంలోని ముళ్లపొదల్లో నగ్నంగా మహిళ, యువకుడి శవాలు బయటపడ్డాయి. అదే ప్రాంతంలో మూడురోజులుగా బైక్ నిలిపి ఉండడం.. అక్కడి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్లి చూసేసరికి నగ్నంగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. బైక్ నంబర్ ఆధారంగా వారాసిగూడకి చెందని యడ్ల అనిరుధ్‌ను పిలిపించడంతో చిక్కుముడి వీడింది.

హత్యకు గురైన యువకుడిని యశ్వంత్‌గా అతని సోదరుడు గుర్తించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అతనికి అదే ప్రాంతానికి చెందిన వివాహితతో శారీరక సంబంధం ఉన్నట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో ప్లాస్టిక్ చాప, కూల్‌డ్రింక్, కండోమ్ ప్యాకెట్స్ ఉండడంతో ఇద్దరూ ఏకాంతంగా కలిసేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే వారిద్దరి వ్యవహారం తెలుసుకున్న భర్త, మరికొందరితో కలిసి ఇద్దరినీ దారుణంగా హతమార్చినట్లు భావిస్తున్నారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడి చేసి కిరాతకంగా చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇద్దరినీ హతమార్చిన తీరు అత్యంత దారుణంగా ఉంది. యువకుడి మర్మాంగాన్ని కసితీరా స్క్రూ డ్రైవర్‌తో పొడిచి.. తల, పొట్టలో పొడిచి దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. మహిళ ముఖంపై బండరాయితో మోది ఆనవాళ్లు కనిపించకుండా ఉండేలా అమానుషంగా హతమార్చారు. మృతురాలి భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి మరో నలుగురు సహకరించి ఉండొచ్చని.. నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News