3 నెలల తర్వాత..వెలుగు చూసిన పరువు హత్య

ఇంటర్ విద్యార్థిని మోహన్ కృష్ణ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అది పరువు హత్యగా అనుమానిస్తున్నారు

Update: 2022-12-02 06:12 GMT

rowdy sheeter ramesh murder

ఇంటర్ విద్యార్థిని మోహన్ కృష్ణ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. అది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి రెడ్డిగారి పల్లెలో ఈ ఘటన జరిగింది. మోహన్ కృష్ణ జులై 7న ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అది హత్యగా తేలింది. ఈ ఘటన గ్రామంలో సంచలనం కలిగించింది.

ఇతర కులానికి చెందిన...
ప్రేమ విఫలమై ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం హత్యగా తేలడంతో కుటుంబ సభ్యులే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర కులం వాడిని ప్రేమించినందుకు ఈ పరువు హత్య చేసి ఉంటారని, ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News