ఆరుగురు సంతానం.. మూడేళ్ల కుమారుడిని అమ్మేశాడు!!

విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి

Update: 2024-09-08 02:15 GMT

ఒక వ్యక్తి తన భార్య, నవజాత శిశువును ఆసుపత్రిలో డబ్బులు కట్టి బయటకు తీసుకుని రావడానికి ఊహించని పని చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తన మూడేళ్ల కుమారుడిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు వేగంగా స్పందించారు. శిశువును తీసుకెళ్లిన జంటతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.

బర్వా పట్టి నివాసి హరీష్ పటేల్ తన భార్య ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ప్రకారం, రోజువారీ కూలీ అయిన పటేల్‌కు ఇది ఆరవ సంతానం. ఈసారి ఆసుపత్రిలో డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది తల్లి, నవజాత శిశువును బయటకు వెళ్లనివ్వలేదు. హరీష్ పటేల్ తన మూడేళ్ల కొడుకును కొన్ని వేల రూపాయలకు ఓ జంటకు విక్రయించడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నేరంలో భాగమైన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు భోలా యాదవ్, అతని భార్య కళావతి లను అదుపులోకి తీసుకున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ కేసులో చర్య తీసుకోవడంలో పోలీసు కానిస్టేబుల్‌ నిర్లక్ష్యం వహించడంతో యాక్టివ్ డ్యూటీ నుండి తొలగించి, ఎస్పీ ద్వారా పోలీసు లైన్‌లకు పంపారు. పిల్లవాడు సురక్షితంగా ఉన్నాడని, అతని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News