గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ... ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2022-03-11 03:39 GMT

గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు జిల్లా నరసరావుపేట దేచవరం అడ్డరోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఇటుకల ట్రాక్టర్, మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇటుకల ట్రాక్టర్....
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా గుళ్లాపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News