ఫ్యాక్ట్ చెక్: సాధువులకు సంబంధించిన వీడియోను.. ముస్లింలు, కిడ్నాపర్లంటూ తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు

పిల్లల కిడ్నాపర్‌లనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సాధువుల వేషధారణలో ఉన్న ముగ్గురు వ్యక్తులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది

Update: 2024-07-19 06:53 GMT

పిల్లల కిడ్నాపర్‌లనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సాధువుల వేషధారణలో ఉన్న ముగ్గురు వ్యక్తులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారులు.. సాధువుల వేషధారణలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ముస్లింలనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.

“मेरठ में साधु बनकर घूम रहे 3 लोगो को पब्लिक ने पकड़ा पूछताछ में नाम बताया सोहन , आधार कार्ड में निकाला “मो० शमीम” “मो० शमीम” अपने गैंग के साथ भगवा कपड़े पहनकर हिंदू मोहल्लों की करता था रेकी पब्लिक ने तीनों पर बच्चे चुराने का भी लगाया आरोप @meerutpolice @Uppolice” అంటూ Sudarshan News TV తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.
మీరట్‌లో సాధువుల వేషంలో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను ప్రజలు పట్టుకున్నారు. విచారణ సమయంలో ఆ వ్యక్తులు తమ ముస్లిం పేర్లను బయట పెట్టారు. ఈ ముఠా పిల్లలను కిడ్నాప్ చేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారంటూ ట్వీట్ లో తెలిపారు.

Full View
ఇంకొంతమంది X వినియోగదారులు అదే వీడియోను “మీరట్‌లో సాధువులుగా తిరుగుతున్న ముగ్గురు రోహింగ్యాలను ప్రజలు పట్టుకున్నారు. వారి పేర్లు మొహమ్మద్ షమీమ్, అల్తాబ్, జుబైర్. వారు కాషాయ బట్టలు ధరించి రెక్కీ చేసేవారు. ముగ్గురు పిల్లలను దొంగిలించారని కూడా ప్రజలు ఆరోపించారు." అంటూ కూడా పోస్టులను వైరల్ చేస్తున్నారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలోని వ్యక్తులు నిజమైన సాధువులే తప్ప కిడ్నాపర్లు కాదు.
వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేశాం. అప్పుడు పిల్లలను కిడ్నాప్ చేయడానికి సాధువుల ముసుగులో కనిపించిన వ్యక్తులు ముస్లింలు కాదనే వార్తలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయని మేము కనుగొన్నాము. మారువేషంలో పిల్లల కిడ్నాపర్లనే అనుమానంతో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ముగ్గురిని కొట్టి, బంధించినందుకు ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురు సాధువులు - గౌరవ్ కుమార్, గోపీనాథ్, సునీల్ కుమార్, అందరూ నాథ్ కమ్యూనిటీకి చెందినవారే.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు సాధువులను కొందరు ముస్లింలుగా అనుమానించి బందీలుగా చేశారు. వారిని కిడ్నాపర్లు అంటూ దారుణంగా కొట్టారు. మొదట సాధువులు గాయత్రీ మంత్రం, తర్వాత హనుమాన్ చాలీసా పఠించారు. దీని తరువాత, వారి ఆధార్ కార్డులను చూపించమని అడిగారు, సాధువులు తమ ఆధార్ కార్డులను చూపించలేకపోవడంతో ప్రజలు వారిని పిల్లలను దొంగిలించేవారిగా అనుమానించి కొట్టడం ప్రారంభించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ సంఘటన మీరట్‌లోని లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రహ్లాద్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు సాధువులు భిక్షాటనకు వెళ్లారు. ప్రహ్లాద్ నగర్‌లో కొందరు ఈ సాధువులను ముస్లింలుగా భావించి అడ్డుకున్నారు. వారు అక్కడికక్కడే గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలీసా పఠించారు. అయినా నమ్మలేదు. ఆ తర్వాత వారిని ఆధార్ కార్డులు అడిగారు, సాధువుల దగ్గర ఆధార్ కార్డులు లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆధార్ కార్డు లేదన్న కారణంతో పిల్లల దొంగలంటూ వారిని కొట్టడం ప్రారంభించారు.
ముగ్గురు వ్యక్తులు హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన సాధువులని స్పష్టం చేస్తూ మీరట్ పోలీసులు రెండు వీడియోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అందుకే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు సాధువులు, ముస్లింలు కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  పిల్లలను కిడ్నాప్ చేసేందుకు సాధువుల వేషంలో ఉన్న ముగ్గురు ముస్లింలను మీరట్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు వైరల్ వీడియో చూపుతోంది.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News