మహ్మద్ సిరాజ్ కు జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలం

హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు జూబ్లీహిల్స్ లో ప్రభుత్వం స్థలం కేటాయించింది

Update: 2024-08-09 13:50 GMT

హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు జూబ్లీహిల్స్ లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. 600 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ఈ మేరకు మహ్మద్ సిరాజ్ కు ఇంటిపత్రాలను అందచేసింది. టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా గెలిచినందుకు ఈ నజరానాను ప్రభుత్వం ప్రకటించింది.

ఆరువందల చదరపు గజాలు..
ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మహ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలంతో పాటు గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్టు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటి స్థలం మంజూరుచేసింది. అతి ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో మహ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలో జారీ కానున్నాయి.


Tags:    

Similar News