నేడు నాగార్జున పరువునష్టం దావాపై విచారణ

నేడు నాగార్జున పరువు నష‌్టం దావా పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-10-10 06:28 GMT

నేడు నాగార్జున పరువు నష‌్టం దావా పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ చేశారంటూ ఆమెపై పరువునష్టం పిటిషన్‌ ను నాగార్జున వేసిన సంగతి తెలిసింది. మొన్న నాగార్జున కుటుంబ సభ్యులు హాజరై తమ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

రెండో సాక్షి స్టేట్‌మెంట్ ను...
అయితే ఈరోజు రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ ను న్యాయస్థానం చేయనుంది. ఇప్పటికే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన కోర్టు ఈరోజు మరికొందరి సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డు చేయనుంది. తమ కుటుంబ ప్రతిష్టలకు భంగం కలిగించారని, ఆమె పై చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటీషన్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News