హైడ్రా యాక్షన్.. ఆరుగురు అధికారులపై కేసు

హైడ్రా అధికారులపై యాక్షన్ కు దిగింది. ఆరుగురు అధికారులు పై కేసు నమోదయింది.

Update: 2024-08-31 07:27 GMT

హైడ్రా అధికారులపై యాక్షన్ కు దిగింది. ఆరుగురు అధికారులపై వేటుకు సిఫార్సు చేసింది. దీంతో ఆరుగురు అధికారులు పై కేసు నమోదయింది. సైబరాబాద్ పోలీసులు కసు నమోదు చేశారు.నిజాంపేట, చందానగర్, హెచ్ఎడీఏ సిటీ ప్లానర్ , అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, బాచుపల్లి తహసిల్దార్ పై కేసు నమోదు చేసింది.

అక్రమ నిర్మాణాలకు...
వీళ్లు అక్రమ నిర్మాణాలకు అడ్డగోలు అనుమతులిచ్చారని హైడ్రా విచారణలో తేలింది. దీంతో అక్రమ నిర్మాణాలను కూలగొట్టడమే కాకుండా వాటికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తున్నారు. ఇంకా మరికొందరు హైడ్రా జాబితాలో ఉన్నారని తెలిసింది.


Tags:    

Similar News