Earth Quke : ఎక్కడ చూసినా మట్టి దిబ్బలే.. మృతుల సంఖ్య పదివేలు దాటొచ్చట

మయన్మార్, బ్యాంకాక్ ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. భూకంపానికి వేలాది మంది మరణించారని తెలిసింది;

Update: 2025-03-29 03:55 GMT
earthquake, deaht toll, myanmar, bangkok
  • whatsapp icon

మయన్మార్, బ్యాంకాక్ ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. భూకంపానికి వేలాది మంది మరణించారని తెలిసింది. దాదాపు ఏడు వందల మందికి పైగా మరణించినట్లు ఇప్పటికే అధికారిక లెక్కలు వినిపిస్తున్నాయి. మృతుల సంఖ్య రోజురోజూకూ పెరుగుతుంది. ఎన్నో వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఎంతో మంది అనాధలుగా మారారు. కంటి ముందే కన్నవారు, కన్నపిల్లలను కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్నారు. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. పది వేలకు పైగానే మృతులు సంఖ్య చేరుకుంటుందని అమెరికాకు చెందిన ఏజెన్సీ తెలపడంతో ఈ లెక్క ప్రపంచాన్ని సయితం వణికిస్తుంది. బ్యాంకాక్ లోనూ వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. వారు కనీసం ప్రాణాలతో బయటపడితే చాలు అని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.

ఆరుసార్లు వరసగా...
మరోవైపు మయన్మార్, బ్యాంకాక్ లో అన్ని ఆసుపత్రుల్లో క్షతగాత్రులతో నిండిపోయాయి. కొందరికి అత్యవసర చికిత్స కాగా, మరికొందరికి ప్రాధమిక చికిత్స చేసి పంపుతున్నారు. అయినా రోగుల రద్దీ అన్ని ఆసుపత్రుల్లో తగ్గడం లేదు. వైద్యం కోసం కూడా అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక అపార్ట్ మెంట్లు, భనవాలు కూలి పోవడంతో ఎవరు ఎక్కడ చిక్కుకున్నారన్నది అర్థం కాకుండా ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరు సార్లు భూమి ప్రకంపనలు రావడంతో ఇంతటి బీభత్సం జరిగింది. ఎత్తైన భవంతులు, పురాతన వంతెనలు అనేక నిర్మాణాలు నేలమట్టం కావడంతో దాని కింద పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు చేపట్టాలన్నా ఒకరోజులో సాధ్యమయ్యే పనికాదు.
నిద్రలో వచ్చిఉంటే...
మధ్యాహ్నం ఈ భూకంపం రావడంతో ఇంకా అనేక మంది తప్పించుకున్నారు. రాత్రి పూట నిద్రలో ఉండగా వచ్చి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముండేదని చెబుతున్నారు. ఎంత మంది చనిపోయారో తెలియదు? ఎంత ఆస్తినష్టం జరిగిందో అంచనాకు అందడం లేదు. మయన్మార్ లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నా ఇంత భారీ స్థాయిలో సంభవించడం ఇదే ప్రధమమని చెబుతున్నారు. భూకంపాలకు తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టినా ఫలితం కనిపించ లేదని వాపోతున్నారు. అనేక మంది నిరాశ్రయులు కావడంతో పునరావాసం ఏర్పాటు చేసి సహాయక చర్యలను ప్రారంభించింది. ఎప్పటికి ఈ రెండు ప్రాంతాలు కోలుకుంటాయన్నది చెప్పలేని పరిస్థితి. అంతర్జాతీయ సమాజం ఆపన్న హస్తం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Tags:    

Similar News