Soundarya: తాను చనిపోతానని సౌందర్యకు ముందే తెలుసా? ఆమె ఎందుకలా మాట్లాడింది!

దివంగత నటి సౌందర్య చివరి మాటలు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు కుటుంబ సభ్యులు. అమితాబ్ బచ్చన్ సరసన నటిస్తూ బాలీవుడ్‌కి అడుగుపెట్టిన ఆమె

Update: 2024-07-13 11:29 GMT

Soundarya

దివంగత నటి సౌందర్య చివరి మాటలు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు కుటుంబ సభ్యులు. అమితాబ్ బచ్చన్ సరసన నటిస్తూ బాలీవుడ్‌కి అడుగుపెట్టిన ఆమె, 2004 ఏప్రిల్‌ 17న మరణించింది . ఆమె దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన తారలలో ఒకరు. బీజేపీకి ప్రచారం చేస్తున్నప్పుడు ఆమె ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌ క్రాష్ అయింది. ఆమె, ఆమె సోదరుడు కేఎస్‌ అమర్‌నాథ్ మరణించారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రస్తుతం సౌందర్యకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సౌందర్య హెలక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే సౌందర్య మరణించే ఒక వారం రోజులు ముందే వాళ్ళ అమ్మానాన్నతో చెప్పిన మాటలు వాళ్ళందరికీ ఆశ్చర్యకరంగా అనిపించటం .. ఎప్పుడు చాలా సరదాగా అల్లరిగా ఉండే సౌందర్య డల్ గా మూడీగా కూర్చొని ఉండటం.

'ఒకవేళ తనకు ఏదైనా జరిగితే తన సంపాదించిన ఆస్తిని సగం మీరు సగం భర్త తీసుకోండి అంటూ చెప్పిందట'. కానీ ఆమె చనిపోయిన తర్వాత భర్త పూర్తి ఆస్తి కొట్టేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు అసలు సౌందర్య ఎందుకు అలా మాట్లాడింది.? అనే విషయం అప్పట్లో వాళ్లకి అర్థం కాలేదట . తీరా జరగరాని నష్టం జరిగిపోయిన తర్వాత కుమిలి కుమిలి ఏడ్చారు సౌందర్య కుటుంబీకులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట మరోసారి బాగా వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా, సౌందర్య మన మధ్య లేకపోయినప్పటికీ .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కోట్లాదిమంది అభిమానులు మదిలో ఉండిపోయింది. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్న సౌందర్య అంటే స్టార్ హీరోలు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానంతో లేకుండా పద్ధతి గానే ఎంటర్టైన్ చేసే హీరోయిన్ అంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది .

కట్టు, బొట్టు, నిండైన రూపంతో పాటు ఏ పాత్ర తీసుకున్నా అందులో ఒదిగిపోయే గుణం సౌందర్య సొంతమనే చెప్పాలి. ఆమె మరణించి నేటికి 20 ఏళ్లు గడిచినా ఇంకా ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నారు.

Tags:    

Similar News