ఆందోళనపై స్పందించిన ఆర్మీజనరల్

అగ్నిపథ్ ఆందోళనలపై ఆర్మీచీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పందించారు. త్వరలోనే రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ ను ప్రకటిస్తామన్నారు

Update: 2022-06-17 07:22 GMT

అగ్నిపథ్ ఆందోళనలపై ఆర్మీచీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పందింాచరు. త్వరలోనే రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చేయవద్దని ఆయన కోరారు. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి రిక్రూట్‌మెంట్ జరపలేకపోయామని ఆయన వివరించారు.

దేశ సేవ చేయాలనుకునే వారు...
అగ్నిపథ్ ద్వారా 2022 నియామకాలకు సంబంధించినదని, ఇప్పటికీ గరిష్ట వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి పెంచామని మనోజ్ పాండే వివరించారు. ఇండియన్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనుకునే వారు అగ్నివీరులుగా అవకాశం దక్కించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News