Ratan Tata : నేటి సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్నాయి.

Update: 2024-10-10 03:49 GMT

 ratan tata's last rites

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో ఆయన పార్ధీవ దేహానికి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం కోల్బాలోని రతన్ టాటా నివాసినికి ఆయన పార్ధీవ దేహాన్ని తరలించారు. ఉదయం 10.30 గంటలకు ముంబయి ఎన్‌సీపీఏ గ్రౌండ్ లో రతన్ టాటా పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు.

సంతాపదినంగా...
సాయంత్రం పార్థీవ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా మృతికి సంతాపసూచకంగా నేడు సంతాప దినంగా ప్రకటించింది. ఆయన పార్దీవ దేహాన్ని చివరి సారి చూసి నివాళులర్పించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. రతన్ టాటాకు సచిన్ టెండూల్కర్ నివాళులర్పించారు.


Tags:    

Similar News