Breaking :దసరా, దీపావళికి ఉగ్రదాడులు : ఇంటలిజన్స్ బ్యూరో హెచ్చరిక

ఢిల్లీ పోలీసులను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఉగ్రవాదుల దాడులు దసరా, దీపావళికి జరుగుతాయని సమాచారం ఇచ్చింది.

Update: 2024-10-07 04:18 GMT

ఢిల్లీ పోలీసులను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఉగ్రవాదుల దాడులు దసరా, దీపావళికి జరుగుతాయని సమాచారం ఇచ్చింది. అప్రమత్తంగా ఉండాాలని ఢిల్లీ పోలీసులకు తెలిపింది. ఈ పండగల వేళ ఢిల్లీలో దాడులకు ఉగ్రవాదులు దిగే అవకాశముందని హెచ్చరికలు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

విదేశీయులను టార్గెట్ గా...
విదేశీయులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు కొనసాగుతాయని తెలిపింది. అందుకే రద్దీ ఉండే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని కూడా హెచ్చరించింది. ఉగ్రమూకలు ఎంబసీలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
Tags:    

Similar News