నేడు ఇండియా కూటమి నేతల భేటీ

నేడు ఢిల్లీలో విపక్ష కూటమి నేతల సమావేశం జరగనుంది. ఫలితాల సరళిపై చర్చించనుంది

Update: 2024-06-01 04:03 GMT

నేడు ఢిల్లీలో విపక్ష కూటమి నేతల సమావేశం జరగనుంది. ఈరోజు లోక్‌సభ ఎన్నికల చివరి దశ ముగియనుండటంతో ఇండియా కూటమి నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలపై పరిస్థితిని సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ జరగనుంది.

ఫలితాలపై...
ప్రధానంగా రానున్న ఫలితాలపై ఇండియా కూటమి నేతలు చర్చించనున్నారు. సమీక్ష చేయనున్నారు. ఉత్తరభారతంలో బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న అంచనాతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు రావన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఈరోజు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు.


Tags:    

Similar News