Parlament : రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

Update: 2024-06-23 07:20 GMT

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. ఆయన సభ్యులందరి చేత నూతనంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకరాం చేసిన తర్వాత లోక్‌సభ ప్రతిపక్ష నేత ప్రమాణం చేయనున్నారు.

తొలుత మోదీ...
తర్వాత ప్యానల్ స్పీకర్లు ప్రమాణం ఉంటుందని స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత వరసగా కేంద్ర మంత్రులు, అనంతరం పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర పేరు ఆంగ్ల అక్షరంతో మొదలయిన చోట నుంచి సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. చివరిగా పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శతాబ్దిరాయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు.


Tags:    

Similar News