Manu Bhaker Medal: మను భాకర్ రజత పతకం ఇలా కోల్పోయింది

మను భాకర్ ఫైనల్ రౌండ్ ను అద్భుతంగా ప్రారంభించింది;

Update: 2024-07-28 10:45 GMT
Manu Bhaker Medal: మను భాకర్ రజత పతకం ఇలా కోల్పోయింది
  • whatsapp icon

ఏస్ ఇండియా షూటర్ మను భాకర్ ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 22 ఏళ్ల మను భారత్‌ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా కూడా రికార్డు సృష్టించింది. దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ యెజీ చేతిలో 0.1 పాయింట్ల తేడాతో తృటిలో రజత పతకాన్ని కోల్పోయింది.

మను భాకర్ ఫైనల్ రౌండ్ ను అద్భుతంగా ప్రారంభించింది. మొదటి ఐదు షాట్ల తర్వాత 50.4 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మను భాకర్ రెండో రౌండ్‌లో 100.3 పాయింట్లు సాధించింది. 121.2 పాయింట్లతో 12 షాట్ల సమయంలో రెండో స్థానంలో కొనసాగింది. ఫైనల్‌ సమయానికి 221.7 పాయింట్లు సాధించి దేశానికి కాంస్య పతకాన్ని ఖాయం చేసింది.
ఈరోజు తెల్లవారుజామున నేషనల్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో షూటర్ రమితా జిందాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. రమిత 631.5 స్కోర్‌తో ఐదో స్థానంలో నిలిచి సోమవారం జరిగే ఫైనల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


Tags:    

Similar News