IPL 2025 : చెన్నై పై బెంగళూరు సూపర్ విక్టరీ.. పదిహేడేళ్ల నిరీక్షణ చెపాక్ లో ఫలించిందిగా

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం విజయం సాధించింది.;

Update: 2025-03-29 02:02 GMT
royal challengers bengaluru, chennai super kings, won, chennai
  • whatsapp icon

చాలా రోజులకు ఒక విజయం, సుదీర్ఘకాలం తర్వాత విక్టరీ. అదీ బ్యాక్ టు బ్యాక్ విజయం. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు దక్కిన అపురూపమైన గెలుపు. ఎందుకంటే చెన్నైలో ఇప్పటి వరకూ విజయం కోసం వేచి చూడటమే తప్ప గెలిచింది లేదు. ఛాంపియన్స్ ట్రోఫీని సాధించినంత సంబరపడింది టీమంతా. నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం విజయం సాధించింది. కానీ పెద్దగా టెన్షన్ లేకుండానే మ్యాచ్ ముగిసింది. దీనికి ప్రధాన కారణం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ లోని బ్యాటర్లు.. బౌలర్లు. ఇలా ఒక మ్యాచ్ పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ గెలిచి సంబరాలు చేసుకున్నారంటే దానికి అది పెద్ద విజయమనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు పదిహేడేళ్ల నుంచి ఈ గెలుపు కోసం టీమంతా ఎదురు చూస్తుంది. కానీ దక్కలేదు. చివరకు ఎట్టకేలకు విజయం సులువుగా తమ ఖాతాలో పడింది.

సొంత మైదానంలో చెన్నైని...
అంతే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ను దాని సొంత మైదానంలో ఓడించి ఈ సీజన్ లో తమకు తిరుగులేదని పించేలా రాయల్ ఛాలెంజర్స్ కనిపించిందనే చెప్పాలి. తొలుగ బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ లో బ్యాటర్లలో రజిత్ పాటీదార్ 51 పరుగుల చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ సాల్ట్ 32 పరుగులు చేసినా సిక్సర్, ఫోర్లతో మోత మోగించాడు. పడిక్కల్ కూడా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 27 పరుగుల చేశాడు. విరాట్ కోహ్లి 31 పరుగులు చేసి అవుటయినా అందరూ సమిష్టిగా రాణించారు. చివరకు టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. చివరి ఓవర్ లో అయితే సిక్సర్ల వర్షం కురిపించాడు. టిమ్ డువిడ్ 22 పరుగులు చేయడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇరవై ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పెద్ద స్కోరేమీ కాకపోయినా...
నిజానికి చెన్నైకి ఇది పెద్ద స్కోరేమీ కాదు. ఎందుకంటే అంతకు మించిన టార్గెట్ ను కూడా ఛేదించింది. అలాంటి సమయంలో వరసగా అవుట్ అయి రాయల్ ఛాలెంజర్స్ చేతిలో చిక్కిపోయారు. రచిన్ రవీంద్ర ఒక్కడే 41 పరుగులుచేయగా, మిగిలిన వారు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. అప్పటికే రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఓవర్ కు 30 పరుగులు పైగానే చేయాల్సి వచ్చింది. అయితే అప్పుడు జడేజా, ధోనీ వచ్చినప్పటికీ ఫలితం లేదు. చెన్నై బ్యాటర్లందరూ ఉసూరుమనిపించడంతోనే బెంగళూరు విజయం ఖాయమమయింది. థోని నాటౌట్ గా నిలచి 30 పరుగులు చేశాడు. చివరకు రెండు సిక్సర్లు, ఫోర్లు బాదినా అప్పటికే మ్యాచ్ ముగిసింది. జడేజా 25 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో ఇరవై ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులు మాతమ్రే చేయగలిగింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ ఒక వికెట్ తీయగా, హేజిల్ వుడ్ మూడు, యశ్ దయాల్ రెండు, లివింగ్ స్టన్ రెండు వికెట్లు తీసీ చెన్నైపై విజయం సాధించగలిగారు.


Tags:    

Similar News