CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్‌

తెలంగాణలో గత నెలరోజులుగా గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు డీఎస్సీనీ వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం

Update: 2024-07-13 13:38 GMT

CM Revanth Reddy

తెలంగాణలో గత నెలరోజులుగా గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు డీఎస్సీనీ వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ విద్యపై జరిగిన సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గత పది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడ్డారని.. తమ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు విడుదలై పరీక్షలకు సిద్ధం అవుతుంటే.. కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

గ్రూప్ 1 ఫైనల్స్‌కు 1:50కి బదులుగా 1:100 పద్ధతిని అనుసరించాలని కొందరు కోరుతున్నారని అన్నారు. నోటిఫికేషన్‌లో వెల్లడించినదానికి భిన్నంగా వ్యవహరిస్తే.. కోర్టులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపేస్తాయంటూ పేర్కొన్నారు. దీంతో మళ్లీ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడతాయన్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరే వారిలో రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ యజమానులే ఎక్కువగా ఉన్నారని సీఎం ఆరోపించారు. ఇటీవల దీనిపై దీక్ష చేసిన ముగ్గురిలో ఎవరూ పరీక్ష రాసే వారు లేరన్నారు.

త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌

అయితే త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్‌. మార్చి నెల చివరిలో ఖాళీ వివరాలు తెప్పిస్తామని, నోటిఫికేషన్‌ ఇచ్చి డిసెంబర్ 9 నాటికి ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ సభ్యుల ఎంపిక విషయంలో గతంలో అవలంభించిన విధానాలను సీఎం రేవంత్ రెడ్డ తప్పుబట్టారు. గతంలో టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల ఎంపిక సరిగ్గా నిర్వహించలేదని, అర్హత లేని వారికి చోటు కల్పించారని ఆరోపించారు సీఎం.

Tags:    

Similar News