నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున

సినీ హీరో నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.

Update: 2024-10-08 04:09 GMT

 Nagarjuna

సినీ హీరో నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తన స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు న్యాయస్థానానికి రానున్నారు. నిన్న నాంపల్లి కోర్టు నాగార్జున కోర్టుకు వచ్చి స్టేట్ మెంట్ రికార్డు చేయాలని ఆదేశించడంతో ఈరోజు ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు.

కొండా సురేఖ కామెంట్స్ తో...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా కేసును దాఖలు చేశారు. నిన్న ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నాగార్జునతో పాటు, సాక్షుల స్టే‌ట్‌మెంట్ ను కూడా రికార్డు చేయాలని తెలిపి కేసు విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో నేడు కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు.
Tags:    

Similar News