Breaking: సీఎస్ సోమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేనని తెలిపింది.

Update: 2023-01-10 05:40 GMT

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేనని తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. అయితే దీనిపై క్యాట్ ను ఆశ్రయించిన సోమేష్ కుమార్ తెలంగాణ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వలను కూడా క్యాట్ కొట్టివేసింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తీర్పు చెప్పింది.

విభజన సమయంలో...
2017 నుంచి ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన ఏపీకి వెళ్లాలని సూచించింది. తెలంగాణ క్యాడర్ నుంచి రద్దు చేసింది. అయితే సోమేష్ కుమార్ తరుపు న్యాయవాది మూడు వారాలు సమయం కోరారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఏపీ క్యాడర్ కు వెళ్లాలని హైకోర్టు సూచించింది. మరి సోమేష్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News