CM Revanth Reddy ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2024 కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

Update: 2024-07-25 04:01 GMT

జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2024 కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తోంది. తెలంగాణ హక్కులను కేంద్రం కాలరాసింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది’’ అని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం బోగస్ అని అంతకు ముందు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ కుర్సీ బచావో బడ్జెట్ లా కనిపిస్తోందని.. బీహార్, ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్నారు. ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి 35 శాతం ఓట్లు, 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినా మోసం చేశారని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయం జరగనందున నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తెలిపారు. నీతి లేదు.. అది పోయింది. ఇక్కడ న్యాయం జరగడం లేదు. కాబట్టి, బడ్జెట్‌లో సరైన ప్రాతినిధ్యం లేదని మా నాయకులు నిర్ణయం తీసుకున్నారని శివకుమార్ తెలిపారు.


Tags:    

Similar News