Telangana : తెలంగాణ సర్కార్ నేడు కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేయనుంది. గ్రూప్ 1 పరీక్షలై ఒక ప్రకటన చేయనుంది.

Update: 2024-10-20 02:20 GMT

తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేయనుంది. గ్రూప్ 1 పరీక్షలై ఒక ప్రకటన చేయనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ వన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీలను కలిశారు. పీసీసీ చీఫ్ ను కూడా కలసి తమ డిమాండ్లను వివరించారు.

ఈ నెల 21వ తేదీ నుంచి...
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి గ్రూప్ వన్ అభ్యర్థులు జరుగుతాయని ప్రకటించిన నేపథ్యంలో నేడు ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు నష్టపోకుండా మంత్రులు ఇప్పటికే చర్చించారు. దీనిపై ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. మరోవైపు ఈ నెల 21 నుంచి గ్రూప్ వన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.


Tags:    

Similar News