Ponguleti : ఖరీదైన వాచ్ ల కొనుగోలు ఈడీ దాడులకు కారణమట

మంత్రి పొంగులేటి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీల్లో వాచ్ లు ప్రధాన పాత్ర పోషించాయి.

Update: 2024-09-28 04:36 GMT

ponguleti srinivasa reddy residency

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీల్లో వాచ్ లు ప్రధాన పాత్ర పోషించాయి. కోట్లు వెచ్చించి వాచ్ లను కొనుగోలు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. వాచ్ ల స్మగ్లింగ్ పై మరో కేసు నమోదు చేసి ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు. మనీలాండరింగ్, ఫెమా చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

వంద కోట్ల విలువైన...
లగ్జరీ వాచ్ ల కొనుగోలు వ్యవహారంలోనే ఈడీ పొంగులేటి నివాసంలో సోదాలు నిర్వహించామని ఈడీ అధికారులు చెబుతున్నారు. పన్నులు చెల్లించకుండా వాచ్ లను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కేసుల్లోనే ఈ సోదాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. గతంలోనే ఈడీ అధికారులు పొంగులేటి కుమారుడికి ఈ విషయంలో నోటీసులు ఇచ్చారు. ఖరీదైన వాచ్ ల స్మగ్లింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. ఇందుకు వంద కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సింగపూర్ నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు ఈ వాచ్ లు వచ్చినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.


Tags:    

Similar News