ఏ ఒక్కరికీ చికత్స లో ఇబ్బంది రాకూడదు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సమీక్షించారు. కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు [more]

Update: 2021-04-26 01:11 GMT

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సమీక్షించారు. కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సోమేష్ కుమార్ కలెక్టర్ లను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సోమేష్ కుమార్ సూచించారు. ఎక్కడా రోగులకు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సోమేష్ కుమార్ కోరారు. ప్రతి పేషెంట్ ను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సోమేష్ కుమార్ ఆదేశించారు.

Tags:    

Similar News