Fri Mar 14 2025 23:48:17 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అమరావతి ఇక హ్యాపీ.. మూడేళ్లలో పనులు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తుంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే టెండర్ల ఆహ్వానించి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇక పనులు ప్రారంభం కావడమే తరువాయి. త్వరలోనే రాజధాని అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. టెండర్లలో అతి తక్కువగా కోట్ చేసిన సంస్థలు పనులను దక్కించుకున్నాయి. తొలి దశలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి కానున్నాయి. ఈ నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు.
సీఆర్డీఏ సంస్థ...
దీంతో అమరావతి రాజధాని పనుల్లో మరో అడుగు పడినట్లే. వైసీపీ హయాంలో నిలిచిపోయిన భవనాలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులను మళ్లీ చేపట్టి పూర్తి చేయడంతో కొత్తగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఆర్డీయే టెండర్లను ఖరారు చేసింది. టెండర్లలో అర్హత సాధించి ఎల్1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వటం ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయా సంస్థలు పనులు మొదలుపెట్టాల్సి ఉంటుంది. తొలుత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను కూడా నిర్మించనున్నారు.
కాంట్రాక్టులను దక్కించుకున్న...
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఐఏఎస్ టవర్లను పూర్తిచేసే కాంట్రాక్టు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ పొందింది. మంత్రులు, జడ్జిల బంగళాలకు పిలిచిన టెండర్లలో బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ తక్కువ కోట్ చేసి టెండర్ ను దక్కించుకుంది. కార్యదర్శుల బంగాళాలను పూర్తి చేసే కాంట్రాక్టును కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కు దక్కింది. ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధికి పిలిచిన టెండర్లను బీఎస్ఆర్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, మేఘా, బీఎస్ఆర్, ఎల్అండ్ టీ, ఎన్సీసీ సంస్థలు దక్కించుకున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఇక హ్యాపీనెస్ట్ కాంట్రాక్టు ఎన్సీసీ చేజిక్కించుకుంది.
ప్రభుత్వం డెడ్ లైన్ ఇదే...
రాజధాని అమరావతి ప్రాంతంలో మిగిలిన రహదారి పనులకు సంబంధించిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్స్, వాటర్ సప్లై నెట్ వర్క్, సీవరేజి నెట్వర్క్, యుటిలిటీ డక్ట్స్, రీ యూజ్ వాటర్ లైన్స్, నడకదారులు, సైకిల్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ వంటి పనులకు 4,313 కోట్లరూపాయల అంచనా అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. వీటికోసం 41 కాంట్రాక్టు సంస్థల నుంచి బిడ్లు పడ్డాయి. ఆయా పనులను ఎంవీఆర్బఎల్, ఎన్సీసీ, బీఎస్ఆర్, ఆర్వీఆర్, మేఘా సంస్థలు దక్కించుకున్నాయి. మొత్తం మీద పనులన్నింటి టెండర్లు పూర్తి కావడం, సంస్థలు ఖరారు కావడంతో ఇక పనులు ప్రారంభించి మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది.
Next Story