Sat Mar 15 2025 20:40:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సచివాలయంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రెండు రోజుల పాటు కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వ పరమైన విధానాలను చంద్రబాబు వారికి వివరించనున్నారు.
వివిధ అంశాలపై...
ఉదయం పది గంటలనుంచి రాత్రి 8 గంటల వరకూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుది. సాయంత్రం ఎస్పీలతో చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలపై చర్చిస్తారు. జరుగుతున్న ఘటనలు, వాస్తవాలు వంటివి ప్రజలకు వెంటనే చెప్పాలని దిశానిర్దేశం చేయనున్నారు. రేపు కూడా కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Next Story