Mon Dec 15 2025 06:46:33 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. కొత్త సీఎస్ నియామకం జరగనుంది

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఆయనను సెలవుపై వెళ్లాలని ఆదేశించడంతో ఆయన వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కొత్త వారిని చీఫ్ సెక్రటరీగా నియమించాల్సి ఉంది. అయితే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వెళ్లిపోవడంతో కొత్త సీఎస్ గా విజయానంద్ నియమితులయ్యే అవకాశముందని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఆయన ప్రస్తుతం...
విజయానంద్ ప్రస్తుతం ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా విజయానంద్ పనిచేశారు. మరి ఆయన పేరు ఖరారవుతుందా? మరెవరినైనా ఎంపిక చేస్తారా? అన్నది తేలనుంది.
Next Story

