Sun Apr 27 2025 07:25:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలల సమయాలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు ఉన్నత పాఠశాలలలు జరుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ సంఘలు ఈ వేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
పాఠశాలల సమయాన్ని....
దీంతో ప్రభుత్వం పాఠశాలల సమయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు జరుగుతాయని ఉత్తర్వల్లో పేర్కొంది. సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాలను మార్పులుంటాయని తెలిపింది.
Next Story