Sun Apr 13 2025 02:57:09 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ సిటిజన్లుకు గుడ్ న్యూస్.. 70 ఏళ్లుదాటిన వారందరికీ పథకం వర్తింపు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పీఎంజేఏవై వయో వందన' పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పీఎంజేఏవై వయో వందన' పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పీఎంజేఏవై పథకం కిందిసామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు ఆపైన ఉన్న వారందరికీ ఉచిత బీమా లభిస్తుంది. . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద 70 ఏళ్లు దాటిన వారికీ రూ.5 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో 70 ఏళ్లు నిండిన వారందరూ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా...
అయితే రాష్ట్రంలో ఇప్పటికే దారిద్య్ర రేఖకు దిగువనున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏడాదికి ఆదాయ పరిమితి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఆరోగ్య బీమా అందుతోంది. 'పీఎంజేఏవై వయో వందన' అమలైతే దారిద్య్రరేఖకు ఎగువనున్న వారూ 5 లక్షల రూపాయల మేర ఉచిత బీమా పొందే అవకాశం లభించింది. . మరో వైపు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 70 ఏళ్ల వయస్సున్న వారికి రాష్ట్రం అందించే ఉచిత చికిత్సకు కేంద్రం నుంచి అదనంగా నిధులు రానున్నాయి.
ఒకదానిలో మాత్రమే...
అయితే ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఒకదానిలో మాత్రమే అమలు చేస్తారు. అందుకోసం ఏ పథకంలో ఉంటారో వన్ టైం ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నవారు అందు లోనే కొనసాగుతారా? పీఎంజేఏవై పరిధిలోనికి వస్తారా? అన్న దానిపై నిర్ణయాన్ని తీసుకోవాలి. వన్ టైమ్ ఆప్షన్ ద్వారా ఈ పథకం కింద చేరేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు. ప్రైవేటు బీమా పథకాల్లో, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ స్కీమ్ పరిధిలో ఇప్పటికే ఉన్న వారూ పీఎంజేఏవై కింద అదనంగా ప్రయోజనం పొందేవీలుంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు తీసుకొచ్చే ప్రత్యేక యాప్ తో 70 ఏళ్లు దాటిన వారు సభ్యులుగా ఎప్పుడైనా చేరొచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లాల వారీగా కొత్త కార్డులు ఇవ్వనున్నారు.
Next Story