Wed Mar 26 2025 20:36:55 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేడు ఏపీకి జేపీ నడ్డా.. ప్రచారం ముగించే రోజున
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి తో పాటు ఆదోని లో ప్రచారంలో పాల్గొంటారు

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఈరోజు చివరి సారిగా ప్రజల ముందుకు వెళ్లేందుకు నేతలు సిద్ధమవుతుున్నారు. సాయంత్రం ఆరు గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. దీంతో ప్రధాన పార్టీలనేతలు ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు.
ముగ్గురు నేతలు...
ఈ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాక తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తో పాటు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం లో ప్రచారంలో పాల్గొంటారు విజయవాడ పశ్చిమ లో షాన్ వాజ్ హుస్సేన్ ప్రచారంలో పాల్గొంటారు భీమవరం లో కేంద్ర మంత్రి జనరల్ వికే సింగ్ రోడ్ షో లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story