Tue Jun 03 2025 23:54:29 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు సాధించేంత వరకూ నిద్రపోరు... దటీజ్ ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ
చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించడంలో ముందుంటారు.ఏపీకి నిధులు తేవడంలో సక్సెస్ అయ్యారు

చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించడంలో ముందుంటారు. అది ముఖ్యమంత్రి పదవి దగ్గర నుంచి రాష్ట్రానికి నిధులు తేవడం వరకూ ఆయన స్టయిలే వేరుగా ఉంటుంది. మెత్తగా ఉంటూనే బతిమాలుడుతున్నట్లు కనపడుతూనే.. సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేస్తూనే.. ఇలా అన్ని రకాలుగా ఏదో రకంగా రాష్ట్రానికి ప్రయోజనాన్ని చేకూర్చడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీని అన్ని రకాలుగా ముందంజలో ఉంచేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వంతో యుద్ధానికి దిగిన రోజులున్నాయి. అలాగే సయోధ్యతతో ఉంటూ ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
భారీగా నిధులును రాబట్టడంలో...
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి భారీగా నిధులను రాబట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారనే చెప్పాలి. దావోస్ నుంచి నేరుగా ఆయన ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడమే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చర్చలు జరిపారు. తమ రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను గురించి చర్చించారు. బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలంటూ ఆయన ప్రతి కేంద్ర మంత్రి ఇంటికీ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. తమకు ఏం కావాలో వారికి కూలంకషంగా వివరించారు. తమ అవసరాలను పదే పదే గుర్తు చేశారు. కేంద్రంలో చంద్రబాబు అవసరాన్ని కూడా గుర్తించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులను కేటాయించింది.
అనేక రకాల ప్రయోజనాలు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు ఇటీవల 11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో పన్నుల వాటా కూడా పెరిగింది. ఏడువేల కోట్ల రూపాయలు అదనంగా పన్నులరూపంంలో కేంద్రం నుంచి నిధులు ఏపీకి అందనున్నాయి. మొత్తం ఈ ఏడాది ఏపీకి ఆంధ్రప్రదేశ్ 57,566 కోట్ల రూపాయలతో బకాయీలు రానున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను అమలు చేసిన కొన్ని సంస్కరణలు యాభై ఏళ్లవరకూ వడ్డీ లేని రుణం పొందే వీలుంది. ఇప్పటికే సంస్కరణలను అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణాలను కూడా పొందే అవకాశం లభించింది. పోలవరం, రాజధాని అమరావతికి కూడా నిధులు మంజూరు చేయడంలో చంద్రబాబు సక్సెస్అయ్యారు. పక్కా ఇళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఏపీ పొందే అవకాశముంది. మొత్తం మీద నిన్న నిర్మలమ్మ విడుదల చేసిన బడ్జెట్ ఏపీకి మాత్రం ఊరటనిచ్చింది. చంద్రబాబు వ్యూహాలు పనిచేసిందనే చెప్పాలి.
Next Story