Sat Jul 06 2024 05:42:20 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో త్వరలోనే కొత్త ఇసుక విధానం
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై కొత్త ఇసుక విధానాన్ని అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు
![ఏపీలో త్వరలోనే కొత్త ఇసుక విధానం ఏపీలో త్వరలోనే కొత్త ఇసుక విధానం](https://www.telugupost.com/h-upload/2024/07/03/1635546-babu.webp)
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై కొత్త ఇసుక విధానాన్ని అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పాలసీ గతానికీ ఇప్పటికీ మార్పు కనబడాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. తక్షణమే ఇసుక అందుబాటులోకి రావాలని చంద్రబాబు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ రంగంలో సంక్షోభం నెలకొందని, ఇసుక కొరత, ధరల భారంతో పనుల్లేక కార్మికుల విలవిలాడారని చంద్రబాబు అభిప్రాయపడ్డార. ప్రైవేటు ఏజెన్సీలు వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని, ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై సీఎం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సామాన్యులకు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిసింది
Next Story