Mon Dec 15 2025 04:09:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పింఛన్ల పంపిణీ పై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

పింఛన్ల పంపిణీ చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీన అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయయి. బ్యాంక్ ఖాతాలు లేని వారికి ఇంటివద్దకే పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలున్న వారికి మాత్రం వారి ఖాతాల్లో మే 1వ తేదీన జమ చేయాలని ఆదేశించారు.
మిగిలిన వారికి...
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి మాత్రం ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ చేస్తారు. ఏపీలో 65,49,864 మందికి పైగా పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో 48.92 లక్షల మందికి బ్యాంకుల్లో జమ చేస్తారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story

