Mon Dec 15 2025 03:47:00 GMT+0000 (Coordinated Universal Time)
బీచ్ వెళ్లి నలుగురు యువకుల గల్లంతు
బీచ్ కు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది

బీచ్ కు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. బాపట్ల జిల్లా రామాపురం బీచ్ కు వచ్చిన యువకులు నలుగురు గల్లంతయినట్లు గుర్తించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సముద్ర స్నానం కోసం వచ్చి అలల తాకిడికి కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
గాలింపు చర్యలు చేపట్టి...
దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గజఈతగాళ్లను రప్పించారు. వారి చేత గాలింపు చర్యలను చేపట్టారు. ఈ నలుగురు యువకులు నెల్లూరు నుంచి బాపట్ల జిల్లా రామాపురం బీచ్ వచ్చినట్లు తెలిసింది. పూర్తి వివారాలు ఇంకా తెలియాల్సి ఉంది. హెచ్చరిక బోర్డులు అక్కడ పెట్టాలని స్థానిక అధికారులకు పోలీసులు చెప్పారు.
Next Story

